పరోటా తయారు చేసే విధానము



కావలసిన పదార్ధాలు :

మైదా - అర కిలో

ఉప్పు - రుచికి తగినంత

పంచదార - అర స్పూను

నెయ్యి లేదా నూనె( పిండి కలుపుకోడానికి) - ఆరు ఏడు స్పూన్లు

నూనె లేదా నెయ్యి - పరోటా కాల్చుకోడానికి


తయారు చేసే విధానము :
ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండిలో ఉప్పు మరియు పంచదార కలుపుకోవాలి. రెండు మూడు స్పూన్ల నెయ్యి లేదా నూనె వెయ్యాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.తరువాత కూడా నాలుగు ఐదు స్పూన్ల నూనె వేసి , ఒక గంట పాటు ఒక తడి గుడ్డ వేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మళ్లీ బాగా కలుపుకోవాలి .
ఇప్పుడు పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండ తీసుకొని దానిని సన్నగా పొడుగ్గా తాడులాగా చేసుకోవాలి. తరువాత దాన్ని గుండ్రంగా చుట్టుకోవాలి. లేదా ఒక ఉండను తీసుకొని దానిని గుండ్రంగా వత్తుకోవాలి. ఇప్పుడు దానిని చీర కుచ్చుళ్ళు పెట్టినట్టు పెట్టుకోవాలి. అలా పెట్టిన వాటిని మళ్లీ గుండ్రంగా చుట్టాలి.
ఇప్పుడు పిండి వెయ్యకుండా రొట్టెల పీట మీద నూనె వేసి కొంచెం మందంగా పరోటాని వత్తుకోవాలి. అలా మిగిలిన ఉండలు కుడా వత్తుకోవాలి. తరువాత పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి కాల్చుకోవాలి. అంతే పరోటాలు రెడీ ......వాటిని మీకు ఇష్టం అయిన కూరతో లాగించేయ్యటమే......
Previous
Next Post »