ఈ స్వామిని ఒక్కసారి దర్శిస్తే గ్రహదోషాలను నివారించుకోవచ్చు





నరసింహుడు లక్ష్మీనరసింహుడిగా మారటానికి ముందు ఉగ్రనరసింహుడై రాక్షసరాజైన హిరణ్యకశ్యపుడిని పంచభూతాల నడుమ, మానవుని తొడలపై, సింహపు గోళ్లతో చీల్చి చెండాడి, అదే ఆవేశంతో అరణ్యమంతా తిరుగాడుతూ.. తిరుగాడుతూ.. శాంతమూర్తిగా మారిన ప్రదేశమే జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం. ఈ ఆలయం అష్టదిక్పాలకులతోఅష్టుశ్వైర్యాలను ప్రసాదించే అష్టభుజి కోనేరుతో నిర్మంచబడిన మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. ఈ కోనేటిలో స్నానమాచరించి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్మించినంతనే గ్రహదోషాలు తొలగి సుఖశాంతులతో జీవిస్తారని ప్రతీతి. ఆధ్యాత్మికతకు, సత్ సంబంధాలను పెంచుకుంటూ ఈ వేసవి సెలవులలో విహార యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఎంతో చల్లదనాన్ని, ఆహ్లాదానిచ్చే ప్రదేశం. ఉదయం వెళ్లి అక్కడ ఉన్న చెట్ల క్రింద వండుకుని అంతా కలిసి తినడానికి, పిల్లలు ఆడుకోవటానికి ఇది ఒక ఆధ్యాత్మిక, విహార యాత్ర వంటిది.

నిజామాబాద్ జిల్లాలోని జానకంపేటలో కొలువైన స్వామి శ్రీలక్ష్మీనరసింహ స్వామి. ఈ స్వామి రుషుల కోరిక మేర అక్కడే స్వయంభూగా వెలిసాడు. కోరిన వారి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, కాకతీయుల ఆరాధ్యదైవంగా చరిత్ర చెపుతుంది. శివకేశవుల మధ్య అభేధాన్ని తెలుపుతూ శివకేశవుల క్షేత్రంగాను రుద్రుడే క్షేత్రపాలకుడిగా ఈ ఆలయం ప్రసిద్ధికెక్కింది. 

అష్టముఖి కోనేరు     


 కలియుగం ప్రారంభంలో ఈ దండకార ణ్యంలో రుషులు తప స్సు చేసే సమయంలో రాక్షసులు వారికి ఆటంకాలు సృష్టించేవారు. రాక్షసుల బారినుంచి కాపాడమంటూ రుషులు నరసింహస్వామిని వేడుకోగా, స్వామి ఆజ్ఞ మేరకు అష్ట దిక్పాలకులు ఎనిమిది దిక్కులకూ కాపలా ఏర్పడ్డారు. రుషుల తపస్సు నిర్విఘ్నంగా సాగేందుకు మధ్యలో నీటి కొలనును ఏర్పాటుచేశారట. అలా ఏర్పడిన కొలను కాలక్రమంలో అష్టముఖి కోనేరుగా ప్రసిద్ధి చెందింది. శనిత్రయోదశి లాంటి విశేషమైన రోజుల్లో శనిదోషాలు ఉన్నవారు ఈ కోనేటిలో స్నానం చేసి గుట్టమీద ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.


ఆలయ విశిష్టత 

 లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటే శనిదోషాలు పోతాయని ప్రతీతి. అందుకే శనివారంతోకూడిన అష్టమీ, అమావాస్య తిథుల్లో వేల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కల్యాణాన్ని నిర్వహి స్తారు. ఏటా మాఘశుద్ధ అష్టమి నుంచి మాఘశుద్ధ ప్రతిపద వరకూ లక్ష్మీనరసింహస్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వీటిని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించాడని వీటిని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. అధ్యయన ఉత్సవంతో ప్రారంభమైన ఈ సంబరాలు చక్రతీర్థంతో ముగుస్తాయి. ఇందులో ద్రవిడ ప్రబంధ పారాయణం, స్థపనం, మాతృకాపూజ, రక్షాబంధనం, అంకురార్పణ, శాలప్రతిష్ఠ, వాస్తుహోమం, కల్యా ణం, రథోత్సవాలు ఉంటాయి. అధిక సంఖ్యలో భక్తులు వీటిలో భాగంగానే కుస్తీపోటీలను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్స వాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించడానికి తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. 

 రవాణా మార్గం

జానకంపేటలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకోవడానికి రైలూ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్షేత్రం నిజామాబాద్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో - బోధన్, బాసర వెళ్లే మార్గంలో ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచీ నిజామాబాద్ జిల్లాకేంద్రానికి బస్సు సదుపాయం ఉంది. అక్కడి నుంచి ఆటోల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చేవారు... నిజామాబాద్ స్టేషన్లో దిగి, రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

స్థలపురాణం 

నిత్యం నారయణ నామస్మరణ చేసే భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు ఆ శ్రీమన్నారాయ ణుడే నరసింహుడి అవతారం ఎత్తి స్తంభం నుండి ఉద్భవించి ఉగ్రనరసింహుడిగా హిరణ్యకశ్యపుడిని సంహరిం చాడు. అనంతరం స్వామి ఆ ఉగ్రరూపంలోనే సంచరిస్తూ జానకంపేట దండకారణ్యానికి చేరుకుంటాడు. అక్కడి ఆహ్లాదవాతావరణానికి ముగ్ధుడైన నారసిం హుడు అక్కడే సేదతీరుతాడు. ఆ అరణ్యంలోనే తపస్సు చేసుకుంటున్న రుషులు స్వామి ఉగ్ర రూపాన్ని చూసి భీతిల్లుతారు.  అనంతరం స్వామిని శాంతమూర్తి అయ్యే మార్గాన్ని ఉపదేశించమని బ్రహ్మదేవుడిని వేడుకుంటారు.

బ్రహ్మ సూచనమేరకు గండకీ నదీతీరంలోని సాలగ్రామాన్ని తీసుకొచ్చి స్వామి నాభి దగ్గర ఉంచగా, శాంతించిన స్వామి అక్కడే లక్ష్మీనరసింహుడిగా వెలిశాడని స్థలపురాణం. జైనమత ప్రవక్త ఈ క్షేత్రాన్ని సందర్శించి, స్వామి విశిష్టతలు తెలుసుకుని స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం వెనక భాగంలో గురుకులాన్ని ఏర్పాటు చేసి మత ప్రచారం చేసేవాడని చెబుతారు. జైనులు నిర్మించిన గురుకులాన్ని కాలక్రమేణా కాకతీయులు ఈ ఆలయాన్ని అభివృద్ధిచేశారు. జైనులు నిర్మించిన గురుకులాన్ని శివాలయంగా మార్చి శివకేశవుల అభేదాన్ని మరోసారి చాటిచెప్పారు. దీనికి గుర్తుగానే లక్ష్మీనరసింహుడి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉమామహేశ్వరుడు ఉండటం విశేషం.)

Previous
Next Post »